కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె మీటింగ్ లో మాట్లాడుతుండాగా ఓ వ్యక్తి గాజులను విసిరి నిరసనలు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అమ్రేలీలో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడికి వచ్చారు. అయితే అనంతరం మీటింగ్ లో మాట్లాడుతుండాగా కాస్వాలా అనే వ్యక్తి లేచి మూడు గాజులను మంత్రి పైకి విసురుతూ.. వందేమాతరం అని నినాదాలు చేశాడు. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించాగా ఆ వ్యక్తికి భండారియా అనే గ్రామనికి చెందిన వాడిగా గుర్తించారు. ఆ తరువాత విచారణ నిమిత్తం అతన్ని పోలీస్ స్టేషన్ కి తరలించి మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి మాట్లాడుతుండగా గాజులు విసిరాడు..అర్థమేంటి ?
by | Jun 13, 2017 | Uncategorized | 0 comments