వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకు నోటు కేసు విషయంలో బయట పడేందుకు చంద్రబాబు సీఎం కేసీఆర్ కు రూ.500 కోట్లు ఇచ్చారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.తిరుపతి పర్యటనను ఉన్నపళంగా రద్దుచేసుకుని విజయవాడ పారిపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు విషయం లో భయపడే చంద్రబాబు ఏపీ ప్రయేయోజనాలను తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు.
భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయం లో కేసీఆర్ కు కూడా ఆరోపించారు.చంద్రబాబు ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ఆనాడు కేసీఆర్ అన్నారు. ఇప్పటికి 14 నెలలు గడుస్తున్నా దానికి అనుబంధ ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని విమర్శించారు. సాక్షత్తు సీఎం స్థాయి వ్యక్తే లంచాలు ఇస్తూ దొరికిపోయాక కూడా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం గా ఉండడం తెలుగు జాతికే అవమానమని భూమన అన్నారు.