Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

క్రికెట్ లోనే కాక ఎలక్షన్ టైం లో కూడా బుకీలు బిజీ అవుతారు. ఏ ప్రాంతానికి ఏ నాయకుడికి అనే లెక్కలో బోలెడు లెక్కలు వేసి మరీ బుకీలు పందేల పందాలు కాస్తారు. పంజాబ్ లో హాంగ్ ప్రభుత్వం వస్తుంది అని బుకీలు బెట్టింగ్ వేసారు. ఆశావహులు యూపీ లో బీజేపీ గెలుస్తుంది అని నమ్మరు.కాగా, వీరి గెస్ నిజ‌మైంది, త‌ద్వారా వారి పంట పండింది. రాజస్థాన్‌లోని చురూ, ముంబై బెట్టింగ్ మార్కెట్ల ప్రకారం యూపీలో బీజేపీ 190-201 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. మొదటి దశ పోలింగ్ ముగిసే టైం కి ఎస్పీ కాంగ్రెస్ ముందర కనపడింది కానీ ప్రధాని మోడీ రంగంలోకి దిగగానే తరవాత దశల్లో బీజేపీ తీవ్రంగా పుంజుకుంది. ఆరో దశ లో బీజేపీ పూర్తి ఆధిపత్యం చూపించింది. మార్కెట్ల ప్రకారం బీజేపీ 190-193 స్థానాలు, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 125-128 సీట్లు, బీఎస్పీ 65-67 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నది. ముంబై మార్కెట్లు మాత్రం బీజేపీకి 198-201 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ దాదాపు సమానంగా 53-55 సీట్లు గెలుచుకుంటాయని మార్కెట్లు అంచనా వేశాయి.