Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లంచం, అవినీతి ఓ కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. పరువుకు భయపడి గతంలో కూతురు, భార్య చనిపోగా అదే పరువు, కేసులకు భయపడి ఇప్పుడు తాను కుమారుడితో కలిసి తనువు చాలించాడు. ఆయన ఎవరో కాదు బీకే బన్సల్. కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన బీకే బన్సల్ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.లక్షలు లంఛం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఇదే కాకుండా పెద్ద మొత్తంలో గతంలో లంచాలు తీసుకున్నాడని, అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సీబీఐ కేసు నమోదు చేసింది. గత జూలైలోనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయగా రెండు రోజుల్లోనే భార్య కూతురు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా బన్సల్ ఆయన కుమారుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీబీఐ కేసులు నమోదుచేసి రైడింగులు నిర్వహించగా ఆయన అపార్ట్మెంట్లో రూ.60 లక్షల నగదు, 20 ఆస్తుల దస్తావేజులు, 60 బ్యాంకు ఖాతాలు వెలుగులోకి వచ్చాయి