Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మహిళల బిగ్ బాష్ లీగ్‌లో మరో భారత బ్యాట్స్‌వుమన్‌కు చోటు దక్కింది. బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ స్మృతి మందనతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆసీస్‌తో హోబర్ట్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా తను వరుసగా 55, 55, 46 పరుగులతో రాణించింది. దీంతో హీట్స్ జట్టులోని ఇతర మహిళా క్రికెటర్లు అంతా ఆమె పేరునే సూచించినట్టు ఆ జట్టు కోచ్ ఆండీ రిచర్డ్స్ తెలిపారు.