Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కృతిక చౌదరీ(30) అనే బాలీవుడ్‌ నటి సుబర్బన్‌ అందేరిలోగల తన సొంత ప్లాట్ లో చనిపోయింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన ఆ పరిసర ప్రాంతవాసులను షాక్ కి గురి చేసింది. తాళం వేసిన ఇంట్లో ఆ యువతి మృతదేహం ఉండడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఖచ్చితంగా హత్య జరిగి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే. 2013 లో వచ్చిన రాజో చిత్రం ద్వారా బాలీవుడ్అ తెరకు పరిచయమైనా కృతిక ఈ మధ్యనే కొన్ని సినిమాలతో హీరోయిన్ గా ఎదిగింది.

అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గాని అంధేరిలోని భైరవనాథ్‌ సొసైటీలో ని తన ప్లాట్ లో శవంగా కనిపించింది. అయితే గత మూడు రోజులుగా ఆ ప్లాట్‌ కి తాళం వేసి ఉంది. అయితే స్థానికులకు ఆ ప్లాట్ లో నుండి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన శవం కనిపించింది. అది కృతికదే అని వారు గుర్తించి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్య 3 రోజుల క్రితం జరిగి ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని ఇది హత్యా ,ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరపనున్నారు.