Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతనితో ఫోన్ సంభాషణ జరిపినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆడియో టేప్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆడియో టేప్ లలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని స్పష్టం చేస్తూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్రానికి నివేదికను పంపినట్లు సమాచారం. అలాగే ఈ ఆడియో టేప్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ట్యాపింగ్ కు పాల్పడలేదని, అసలు అలాంటి అవకాశమే లేదని ఇంటలిజెన్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మేరకు ఈ విషయాలను ఓటుకు నోటు కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారికి ఒక ఐబీ అధికారి తెలిపినట్లు సమాచారం. అలాగే ఆడియో టేప్ వ్యవహారంలో ఫోన్ కాల్స్ కు సంబంధించిన సెల్ ఫోన్ టవర్ లొకేషన్లను ఇంటలిజెన్స్ బ్యూరో సాక్ష్యాలుగా చూపిందట. అంతేకాకుండా ఫోన్ సంభాషణకు సంబంధించిన సెల్ ఫోన్ టవర్స్ ఒకటి చంద్రబాబు అద్దె ఇంటి వద్ద లొకేషన్ లో ఉండగా మరొకటి స్టీఫెన్ సన్ ఇంటి సమీపంలో ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తన నివేదికలో పొందుపరచినట్లు సమాచారం.