ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం తో పరిశ్రమలకి రాయతీలు వస్తాయి అనేది పూర్తి అబద్ధం అనీ హోదా వల్ల ఏ ఉపయోగం ఉండదు అనీ చంద్రబాబు ఘంటా పదంగా చెబుతున్నారు. నెల్లూరు లోని రేగడి చెలిక గ్రామం లో ఇంఫ్కో కిసాన్ సెజ్ లో ఏర్పాటు చేసిన పవర్ ప్లాన్ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని ప్రత్యేక హోదాలో లేదన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వమే రాయితీలు అందిస్తుందన్నారు. హోదాలోని అన్ని లాభాలు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి అందుతాయన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలలో పరిశ్రమలు పెట్టేవారికి వడ్డీ సబ్సిటీ కోసం కేంద్రం రూ.వంద కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు.