ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై నెటిజన్లంతా సెగలు పొగలు కక్కుతున్నారు.అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే ప్రూఫ్స్ చూపించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా నేపథ్యం లో సోషల్ మీడియాలో ఆయనపై మోత మోగిపోతోంది.వివిధ రకాల పద్ధతుల్లో ఆయన పై నిరసన వ్యక్తం చేస్తున్నారు.మొన్న సల్మాన్ ఖాన్, నిన్న ఓంపురి తాజాగా కేజ్రీవాల్ లు నెటిజన్ల దేబాకు బలైనవారే.చాలా సున్నితమైన అంశంపై ఆచి తూచి మాట్లాడాలన్న నిజం వీళ్లకు ఎప్పటికి అర్థమవుతుందో ఏమో..?