Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ సమ్మె, కార్మికుల డిమాండ్లు, ప్రభుత్వ పరిష్కారం మొదలగు అంశాలపై మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. అలాగే అధిక ఫిట్ మెంట్ ఇచ్చే స్థోమత ప్రభుత్వానికి ఉంటే అసలు కార్మికుల చేత సమ్మె ఎందుకు చేయించినట్లు అంటూ పొన్నం ధ్వజమెత్తారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ గొప్పలు చెప్పుకోవడానికి కెసిఆర్ కార్మికుల చేత సమ్మెలు చేయించి ప్రజలను నానా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. అలాగే కార్మికులు 43% ఫిట్ మెంట్ అడిగితే 44% ఇచ్చారని, అలాంటప్పుడు సమ్మె పాపమెవరిదని పొన్నం ప్రశ్నించారు. ఇక కార్మికుల చేత పాలాభిషేకం చేయించుకునేందుకే కెసిఆర్ అడిగిన దానికన్నా అధిక ఫిట్ మెంట్ ఇచ్చారని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.