Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్. అతని రాజకీయ చతురత, అతని ప్రయాణం, అతని ఆలోచనలు ఇప్పటి వరకు ఎ ఒక్క రాజకీయ పార్టీకి అర్ధం కాని విధంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు జిల్లాల వారీగా పవన్ కళ్యాణ్ పరీక్షాల ద్వారా జనసేన సైనికులని, నాయకులని ఎంపిక చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటి అరకు రాజకీయాల్లో ఇలాంటి విధానాన్ని ఎవరు చూడలేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అతను తనకు కావాల్సిన అభ్యర్ధులని నియజక వర్గాల వారీగా పాదయాత్ర చేసి ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ మాత్రం సరికొత్తగా తన రాజకీయ ప్రయాణం అందరికి చూపిస్తున్నాడు.

అయితే పవన్ రాజకీయ ప్రయాణం కార్పోరేట్ స్టైల్ లో వుందని మిగిలిన పార్టీల వారు విమర్శలు చేస్తూన్న అంతర్గతంగా మాత్రం కాస్తా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మాట ప్రకారం పవన్ రాజకీయ ప్రయాణం వెనుక ప్రస్తుతం తెలుగులో టాప్ లో వున్న ఒక మీడియా సంస్థ అధినేత. సీనియర్ పత్రికా సంపాదకుడుగా, రాజకీయ విశ్లేషకుడుగా మంచి గుర్తింపు వున్న భాగా పేరున్న ఓ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. అతన్ని పవన్ అనధికారికంగా రాజకీయ సలహాదారుగా పెట్టుకొని తన వ్యూహాలని అమలు చేస్తున్నట్లు కూడా ఓ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అలాగే మీడియా సంస్థ, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సమావేశాలకి, ఆయన మాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, అతన్ని జనం మధ్యకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజనీతి, రాజకీయ నీతి ఎ విధంగా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు, తెలుగు ప్రజలు కూడా ఆశపడుతున్నారు.