Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సీనియర్ నటీమణి, పవన్ కల్యాణ్ అత్త అదేనండీ.. నదియా బిగ్ ప్రాజెక్టు కోసం సంతకాలు చేసేసింది. మిర్చి, అత్తారింటికి దారేది వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్ర పోషించిన నదియా ఏడాది తర్వాత తెలుగు ప్రాజెక్టుకు ఓకే చెప్పిసింది. రామ్ చరణ్- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చే మై నేమ్ ఈజ్ రాజులో నదియా నటించనున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుండగా, కృతి కర్బందా చరణ్ సిస్టర్‌గా, నదియా కీలక పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా చెర్రీ, రకుల్ ప్రీత్ సింగ్‌లపై ఓ పాటను స్పెయిన్‌లో చిత్రీకరిస్తున్నారు. 2015 దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.