సీనియర్ నటీమణి, పవన్ కల్యాణ్ అత్త అదేనండీ.. నదియా బిగ్ ప్రాజెక్టు కోసం సంతకాలు చేసేసింది. మిర్చి, అత్తారింటికి దారేది వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్ర పోషించిన నదియా ఏడాది తర్వాత తెలుగు ప్రాజెక్టుకు ఓకే చెప్పిసింది. రామ్ చరణ్- శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చే మై నేమ్ ఈజ్ రాజులో నదియా నటించనున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుండగా, కృతి కర్బందా చరణ్ సిస్టర్గా, నదియా కీలక పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా చెర్రీ, రకుల్ ప్రీత్ సింగ్లపై ఓ పాటను స్పెయిన్లో చిత్రీకరిస్తున్నారు. 2015 దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.