కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దేవ్ గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 60 ఏళ్ళు. నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వంలో ఆయన 2016 నుంచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. గత జనవరి నెల నుంచి ఆయన న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణాంతరం బౌతిక దేహాన్ని ఆల్ ఇండియా మెడికల్ సైన్సు కి తరలించారు. ఆయన 2009 మొదటి సారి రాజ్యసభకి ఎన్నికయ్యాడు. తరువాత కాలంలో బీజేపీలో కీలకంగా పని చేసిన ఆయన కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలకమైన పర్యావరణ, వాతావరణ శాఖ ని అప్పగించి మంత్రి పదవి ఇచ్చారు. ఈయన మోడీ తలపెట్టిన నర్మదా నది పరిరక్షణ మీద పూర్తిగా ద్రుష్టి పెట్టి దానిని బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. అనిల్ దేవ్ మరణ వార్త విన్న నరేంద్ర మోడీ ఆయన స్మృతులని గుర్తు చేసుకొని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుబూతి తెలిపారు.
పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దేవ్ కన్నుమూత. చాలా బాధాకరం..
by | May 18, 2017 | రాజకీయం | 0 comments