Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

(మే 2 న శని వారం నాడు) అమెరికా సంయుక్త రాష్ట్రా లలో పర్యటన చేస్తున్న BJP నాయకులు కృష్ణ సాగర్ గారి గౌరవార్దం ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సమావేశం న్యూ జెర్సీ లోని ‘ మిర్చి’ రెస్టారెంటు లో ఘనంగా జరిగింది.

చాలా మంది ప్రవాస తెలుగు వారు హాజరైన ఈ సమావేశానికి ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం, న్యూ జెర్సీ తెలుగు వారు, ఉత్తర , దక్షిణ రాష్ట్రాల వారు సభికులందరికీ స్వాగతం తెలుపుతూ ప్రారంబించారు.

తెలంగాణా లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు లో ఎలా విజయం సాదిoచాలో, మిగితా జిల్లా లో భారతీయ జనతా పార్టీ ఎలా పట్టు సాదిoచాలో మరియు తెలుగు దేశం తో కలవలో, వద్దో లాంటి పలు అంశాలు ఫై సుదీర్గ చర్చ జరిగింది.

తెలంగాణలోని ఫ్లోరైడ్ సమస్య, ఇతర ప్రజాసమస్యలను తెలంగాణలోని కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత బదిలీ విషయంలో ఎన్నారైల సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం భారతదేశంలోని అన్ని రంగాలనూ అభివృద్ధి పథంలోకి తీసుకెల్లడాన్ని తొందరలో చూడాలని ఉందన్నారు.

కార్యక్రమంలో పలువురి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తాం అన్నారు.

ఈ కార్యక్రమం లో ప్రవాస ప్రముఖులు క్రిష్ణా రెడ్డి , జంబుల విలాస్ రెడ్డి , హేమ చంద్ర , సంతోష్ రెడ్డి , రామ్ , అరవింద్ మోదిని, కృష్ణ సాగర్ , రామచంద్ర రెడ్డి , అడప ప్రసాద్ గారు మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.