నిర్మాత బండ్ల గణేష్పై పలు రకాలుగా వార్తలు వచ్చాయి. గుంటూరు ఫైనాన్సియర్ 80 లక్షల కేసులో మోసం చేశాడని గణేష్పై కేసు పెట్టాడు. ఆ తర్వాత నుంచి మరికొన్ని కేసులు వున్నాయంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇవన్నీ అబద్దాలేనని.. తానేమీ తప్పుచేయలేదని బండ్ల గణేష్ వివరణ ఇస్తున్నాడు. ఇటీవలే ప్రకాష్రాజ్.. ఇంటర్వ్యూలో ఆయన ప్రత్యక్షమయ్యారు.
అక్కడ మీడియానుద్దేశించి.. నాపై ఏవో వార్తలు రాస్తున్నారు. నేను ఎస్కేప్ అవ్వలేదు. మీముందే వున్నానంటూ… ఎవరో లేనిపోని వార్తలు రాస్తున్నారు. పోలీసు కేసులున్నాయంటూ చెబుతున్నారు. నేను తప్పు చేస్తే… మీ ముందుకు ఎలా వస్తాను. అవన్నీ పుకార్లే అంటూ చెబుతున్నాడు.
ప్రస్తుతం గోవిందుడు.. సినిమా అద్భుతమైన కలెక్షన్లతో ముందుకు సాగుతోందని… అనుకున్నట్లుగా కలెక్షన్లు వస్తాయని అంటున్నాడు. నాలుగు రోజుల్లో ఆంధ్రలో 9.5 కోట్ల షేర్ వసూలైందని, సీడెడ్ 4.3 కోట్లు, నైజాం.. 5.35 కోట్లు.. మొత్తం 19.9 కోట్లు వసూలు చేసిందన్నారు. ఇంకా ముందుముందు మరింతగా వసూలు చేసి… అందరికీ లాభాలు తెచ్చిపెడుతుందని అంటున్నాడు.