Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సుదీర్ఘ విరామం తర్వాత ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే భారత వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అక్టోబర్ 29న విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తను చివరిసారిగా ఆడాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది.
 గాయపడిన ఆటగాళ్లు తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే కనీసం ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలని ఇటీవల కోచ్ కుంబ్లే ప్రొటోకాల్ విధించారు. అయితే ఇప్పటికే టెస్టుల నుంచి వైదొలిగిన ధోనికి ఈ నిబంధన వర్తించదు. 2015లో ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్ కోసం ధోని విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు. అయితే ఈసారి హజారే ట్రోఫీ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిశాక ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు ధోని రెగ్యులర్‌గా జార్ఖండ్ జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్నట్టు జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.