Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రియో ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుని శుభారంభం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ లో శ్రీజేష్ సేన 3-2 తేడాతో విజయాన్ని అందుకుంది.మ్యాచ్ ఆరంభంలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వని భారత్ 2-0 తో దూసుకు పోయింది.

చివర్లో భారత్ తడబడడంతో ఐర్లాండ్ పుంజుకుంది. భారత్ తరుపున రూపేందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. రఘునాథ్ ఒక గోల్ చేసాడు. సిడ్నీ ఒలంపిక్స్ -2000 తరువాత భారత్ ఆరంభ మ్యాచ్ లో గెలవడం ఇదే తొలిసారి. భారత్ తరువాతి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ జర్మనీ తో తలపడనుంది.