Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మూడంతస్థుల భవనం కుప్పకూలింది. నమోతీ నగర్ ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల భవనం బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాల పాలైయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం శిథిలాల కుంద నుంచి ఒక శవాన్ని బయటికి తీశారు. శిథిలాలను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి.