Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో నేడో తేలిపోనుంది. రాత్రి సింగపూర్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమవుతారు. బుధవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో, ఈ భేటీలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. దేవీప్రసాద్, శేరి సుభాష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరు దాదాపు ఖరారయినట్టు తెలుస్తోంది.