Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టీఆర్ఎస్ ప్రభుత్వానికి వరసగా కోర్టులలో చిక్కులు ఎదురవుతున్నాయి. సోమవారం సుప్రీంకోర్టులో ఎంసెట్ కౌన్సిలింగ్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనను సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టుతో పాటు నిన్న హైకోర్టులో కూడా టీఎస్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పేరిట జారీ చేసిన నంబర్ ప్లేట్లను టీఎస్ పేరిట మార్చుకోవాలంటూ జూన్ నెలలో జారీ చేసిన జీవో నెం.3పై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో నెంబర్ 3ను ప్రశ్నిస్తూ హైదరాబాద్ కు చెందిన జె.రామ్మోహన్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు తమిళనాడు, కర్నాటకలతో పాటు ఉత్తారాది రాష్ట్రాల వాహనాలు నెంబర్ ప్లేట్లపై ఎటువంటి మార్పు లేకుండా హైదరాబాద్ లో తిరుగుతున్నాయని…. 60 ఏళ్లు ఉమ్మడిగా ఉండి కూడా ఏపీ నెంబర్ ప్లేట్లతో హైదరాబాద్ లో వాహనాలు తిరగడానికి అభ్యంతరం చెప్పడం సరికాదని వాదించారు. ఈ వాదనకు మీ వివరణ ఏంటని హైకోర్టు రవాణా శాఖ న్యాయవాదిని ప్రశ్నించింది. జీవో నెం3 ప్రాథమికంగా జారీ చేసినప్పటికీ…. అసలు అమలు చేయలేదని రవాణా శాఖ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రవాణా శాఖ న్యాయవాది ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ధర్మాసనం అసలు ఇటువంటి జీవో జారీకి ఏ చట్టం అనుమతిస్తున్నదో తెలపాలని అడిగింది. ఈ విషయంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రవాణా శాఖ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.