Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్. ఆ ధోరణి ఈ రోజుల్లో అయితే మరి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రస్తుత అధికార ప్రభుత్వాలపై మాటల తూటాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ విమర్శలు వెల్లువలు ఊపందుకున్నాయి. రీసెంట్ గా వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే రోజా చంద్రబాబు పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ అది మారవకముందే ఆ పార్టీ నేత పార్థ సారథి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలను చేశారు.

టిడిపి ప్రభుత్వానికి మతి స్థిమితం కోల్పోయి పిచ్చిగా పర్ అవర్తిస్తుందని పార్థ సారథి ఘాటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని విషయాలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అలాగే ఏమి చేయలేని ఒక దద్దమ్మ ప్రభుత్వం అంటూ తీవ్ర స్థాయిలో పార్థ సారథి మండిపడ్డారు. అంతేకాకుండా పేదల దగ్గర భూములు కూడా లాక్కున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.