తమిళనాడు వ్యాప్తంగా ప్రస్తుతం జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.జల్లికట్టు ఆడడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.జల్లికట్టు అంశం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై సినీ హీరో సూర్య కుడా స్పందించారు. ఈ సందర్భంగా సూర్య జల్లికట్టు కు తన మద్దత్తు ప్రకటించాడు. జల్లికట్టు పై నిషేధం విధించడంలో కీలక పాత్ర పోషించిన జంతు హక్కుల సంస్థ పెటా పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.
స్థానిక జాతి జంతువుల అంతర్ధానానికి కారణమవుతున్న వారే జంతువుల హక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పెటా తీరుని ఎద్దేవా చేశారు. జల్లికట్టుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలు సబబే అని అన్నారు. జల్లికట్టు వలన ఎద్దులకు ఎటువంటి హాని జరగదని..ఈ విషయంలో పెటా అబద్దాలు చెబుతోందని ఆరోపించారు. అబద్దపు ప్రచారంతో కోర్టులో విజయం సాధించిన పెటా ప్రజా కోర్టు లో ఓడిపోయిందని అన్నారు. జల్లికట్టు కోసం ఆందోళనలు చేపడుతున్న ప్రజలకు సినీ రాజకీయ నాయకుల మద్దత్తు లభిస్తోంది. సూర్య త్వరలో సింగం 3 చిత్రంతో రానున్న విషయం తెలిసిందే.