Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు జయలలితను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే గతంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సైతం హైకోర్టు రద్దు చేసింది. ఇక జయలలితపై మోపబడిన అన్ని అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. దీనితో జయ అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అలాగే తమిళనాడు మొత్తం ‘అమ్మ’ నిర్దోషి అని తేలడంతో పండగ వాతావరణం నెలకొంది.