Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సహజమే. ఆ విమర్శలతీరు శృతి మించిన సమయంలో వివాదాలు చోటుచేసుకుంటుంటాయి. గుంటూరులోని పిడుగు రాళ్ళలో జరిగిన మహా సంకల్ప యాత్రలో టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపిపై వారు తీవ్రమైన విమర్శలు చేశారు.

వారిపై నేత బొత్స సత్యనారాయణ పెద్ద మూర్ఖుడని అన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నా రుణమాఫీ జరగలేదని బొత్స అందం అతడి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 55 లక్షల మందికి పింఛన్లు అందిస్తోందని అన్నారు. గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు జగన్ పరోక్షంగా అయినా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే మహా నేతలంటూ వారి సమాధుల వద్ద రాజధానిని నిర్మించే వారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో రాజధాని గుంటూరు జిల్లాకు వచ్చిందని అన్నారు.