Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎమ్మెల్సీ ఎన్నికల ముడుపుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉందని తెలిసిన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బస్టాండులో దొంగతనం చేసే దొంగ సీసీ కెమెరా దొరికిపోయి ఆ సాక్ష్యాలను పోలీసుల కుట్రగా అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
మెదక్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డబ్బులతో రాజకీయం చేసే సంస్కృతి ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి కుట్రలు, నీతులు నిజాయితీలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.  తాను 5 కోట్ల మందికి ప్రతినిధినని చంద్రబాబు పేర్కొనడాన్ని ఆయన ఎత్తి చూపారు. అంటే తెలంగాణ ప్రజలకు ప్రతినిధి కాదనే విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయని ఆయన దుయ్యబట్టారు.