Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని నరేంద్రమోడి ధరించిన సూట్ గతంలో భారీ ధరకు వేలంలో అమ్ముడైన విషయం తెలిసిందే.కాగా సూట్ మరో మైలురాయిని చేరుకుంది. ఈ సూట్ గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. మోడీ ధరించిన సూట్ ను గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి రూ 4,31,31,311 కు సొంతం చేసుకున్నాడు. 2015 ఫిబ్రవరి 20 న ఈ వేలం జరిగింది.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా మోడీ ఈ సూట్ ను ధరించాడు. అప్పట్లో ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా విమర్శించాయి. ఈ సూట్ తయారీకి రూ 10 లక్షలు ఖర్చవడంతో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ సూట్ ను వేలంలో కొన్న వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్ మాట్లాడుతూ .. దేశం కోసం ఏదోఒకటి చేయాలని తనకు ఉండేదని, ఈ సూట్ కు వచ్చిన డబ్బులతో గంగానదిని ప్రక్షాళన చేస్తారని తెలియడంతో కొన్నానని అన్నారు. కాగా ఈ సూట్ అత్యంత ఎక్కువధరకు అమ్ముడైన సూట్ గా గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.