కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన గంగులు ప్రభాకర్ రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో వేరు కుంపటి తప్పేట్టు కనిపించడం లేదు. గంగుల ప్రభాకర రెడ్డి చేరిన తర్వాత వైసీపీ అధినేత జగన్ తో ఆయన భేటి చాలా ప్రాదాన్యత సంతరించుకుంది. త్వరలో నంద్యాల నియోజకవర్గం లో రానున్న ఉప ఎన్నికల్లో నద్యాల ఎమ్మెల్యే టికెట్ గంగుల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఇవ్వనుందనే వార్త ప్రచారంలో వున్న నేపధ్యంలో గురువారం జగన్, గంగుల కలయిక ఆ వార్తని నిజం చేసేలా కనిపిస్తుంది. అయితే గంగుల చేరిక మీద నంద్యాల నియోజకవర్గ ఇన్ చార్జ్ కి కాస్తా అసంతృప్తి ఉందనే మాట వినిపిస్తున్న.. గంగుల చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అంటున్నారు. అయితే గంగుల ప్రభాకర్ రెడ్డి చేరిక తరువాత పార్టీలో పరిస్థితి ఎలా మారుతుందో తెలియకుండా ఉంది. పార్టీలో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం వుందని కొందరు అంటుంటే. అలాంటి అవకాశమే లేదని మరికొంత మంది అంటున్నారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో కాలమే సమాధానం చెబుతుంది.