Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణాలో ఒంటరిపోరాటం చేస్తూ టిడిపి భారాన్నంతా రేవంత్ రెడ్డే మోస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణాలో టిడిపి ఉన్న ఒకేఒక్క ఆశ రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మిగతా నాయకులున్నా వారంతా అంటి ముట్టనట్టుగా ఉన్నారు.రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు సమస్యల్లో చిక్కుకున్నా కేసీఆర్ కుటుంబం పై మాత్రం విమర్శల జోరు తగ్గించడం లేదు.ఎల్ బి నగర్ లో టిడిపి చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబం పై మరోమారు రేవంత్ విరుచుకుపడ్డారు.

తన కూతురు కవిత బతుకమ్మ సంబరాలకోసం కేసీఆర్ రూ.15 కోట్లు వెచ్చించారని రేవంత్ ఆరోపించారు.తన బిడ్డ పై ఉన్న ప్రేమ ముఖ్యమంత్రిగా పేద బిడ్డల పై లేదా అని రేవంత్ ప్రశ్నించారు.ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా కేసీఆర్ పేద బిడ్డల చదువులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.ఫీజు బకాయిలు చెల్లిస్తామని అసెంబ్లీ లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.లేకుంటే జుట్టు పట్టుకుని హామీ నెరవేర్చేలా చేస్తామని రేవంత్ తీవ్రంగా స్పందించారు.