రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. తొందరపాటు వ్యాఖ్యలు చేసి ఒక్కోసారి రాజకీయంలో నవ్వులపాలవుతారు. మారికొందరైతే ఏ మాత్రం భయం లేకుండా అవును నేను ఇలానే మాట్లాడుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ఇదే తరహాలో పాట్నాకు చెందిన జన అధికార్ పార్టీ ఎంపీ అయిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ అనూహ్య వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. రీసెంట్ గా మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన రక్షణ దళల గురించి ప్రస్తావిస్తూ.. మావోయిస్థులకు ఎవరు ఉహించనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. కావాలంటే ప్రజలను మోసం చేసే రాజకీయ నాయకులను చంపేయండి. అంతే గాని దేశనికి రక్షణగా ఉండే వారిని హతమార్చడం సరికాదని చెప్పాడు. ఈ విధమైన వ్యాఖ్యలు రాజేష్ రంజన్ కి కొత్తేమి కాదు ఇంతకుముందు కూడా అవినీతి పరులైన అధికారులను గాని. రాజకీయనాయకులను గాని చంపితే 10 లక్షల నజరానాను ప్రకటిస్తానని చెప్పారు. అంతే కాకుండా ఎవరైనా అవినీతిపరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదిస్తే 25 వేల రూపాయల నజరానాగా ఇస్తానని పలు రకాల వ్యాఖ్యలు చేశారు.
కుదిరితే నాయకులను చంపేయండి..10 లక్షలు ఇస్తా..!: ఎంపీ
by | May 4, 2017 | Uncategorized | 0 comments