Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరో కొత్త పాత్ర పోషించనున్నారు. భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే భాగంలో ఆయన తొలిసారిగా వ్యాఖ్యాతగా మారనున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ ప్రసారకర్త స్టార్‌ గ్రూప్‌ కేవలం ఈ మ్యాచ్‌ కోసమే తమ కామెంటేటర్స్‌ ప్యానెల్‌లో సచిన్‌ను చేర్చింది.

అయితే ఇంగ్లిష్‌ కామెంటరీ ఐసీసీ చేతుల్లో ఉండటంతో కేవలం ఆయన హిందీ కామెంటరీ బాక్స్‌లోనే కనిపించనున్నారు. కానీ సచిన్‌  మ్యాచ్‌ ఆద్యంతం కామెంటరీ వినిపించరని, ఎక్స్‌పర్ట్స్‌ ప్యానెల్‌లో మాత్రమే భాగంగా ఉంటారని స్టార్‌ గ్రూప్‌ పేర్కొంది.