Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎంఐఎం పార్టీ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలను లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం విమర్శలు గుప్పిస్తోంది. మొన్నటిమొన్న ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించింది. ఇపుడు దేశానికి పెద్ద ప్రమాదకరమైన ఆ సోదరులిద్దరూ ‘రాక్షసులు’ అంటూ పేర్కొంది.

పార్టీ పత్రిక సామ్నాలో ఈరోజు రాసిన ఆవేశపూరిత సంపాదకీయంలో ఈ మేరకు వారిద్దరిపై సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ముంబైలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఈ సోదరులిద్దరూ మతం రంగు పులమాలనుకుంటున్నారని ఆరోపించింది.

వారిద్దరూ పాకిస్థాన్ అనుకూల వ్యక్తులంటూ సంపాదకీయంలో పేర్కొన్న సేన… దేశానికి వారేమి చేయలేరని, ఔరంగాబాద్, నవీ ముంబైలో పొరుగు దేశ జెండాను ఎగురువేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తింది. ఇటీవల బాంద్రా ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎంఐఎం ఓటమిపాలైన నేపథ్యంలో దాన్నుంచైనా ఒవైసీ సోదరులు పాఠం నేర్చుకోవాలని సేన సూచించింది.