Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సహోద్యోగి లైంగికంగా వేధించాడని ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని ఓ హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో క్యాబిన్ క్రూలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఎయిర్ హోస్టెస్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ‘జీరో ఎఫ్ఐఆర్’లో భాగంగా నేరం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని పక్కనబెట్టి, తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం, నివేదికను తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పోలీసు స్టేషనుకు బదిలీ చేస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గత నెల 25న జరిగిందని, ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తరువాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందని వివరించారు.