Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఓ వేగుచుక్క. గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి టీడీపీ, బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కా వ్యూహంతో మరో రెండేళ్ళలో రానున్న ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయ నాయకులకి ఎ మాత్రం అర్ధం కాని విధంగా , సరికొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రతి చోట పాతుకుపోయిన పాతతరం నాయకులకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి, కొత్త తరానికి కొత్త నాయకులని, యువతరంలో నాయకత్వ లక్షణాలు వున్న సరికొత్త తరం నాయకులని తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రాజకీయ నాయకులందరు. రాష్ట్రంలో తాము తప్ప మరో దిక్కులేదని, జిల్లాల వారిగా తాము ఇప్పటికే నాయకులుగా పాతుకుపోయామనే భ్రమలో వున్నారు. వారందరికీ పంచ్ ఇచ్చే విధంగా నాయకత్వం అంటే ఎలా ఉంటుందో, యువతరంలో ఎలాంటి నాయకులు వున్నారో అనే విషయాన్ని అందరికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. నాయకుడు ఎప్పుడు జనం మధ్య నుంచి పుట్టుకొస్తాడు అనే విషయాన్ని నమ్మిన పవన్ కళ్యాణ్, అలా జనం మధ్యలో సామాజిక స్పృహ కలిగి, సేవా కార్యక్రమాలు చేస్తున్న యువతరాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మధ్య దేశంలో కూడా కొందరు యువనాయకులు ఒక్కసారిగా ఫ్రేమ్ లోకి వచ్చి తమ మాటలతో, చేతలతో ప్రజలని విశేషంగా ప్రభావితం చేసారు. అలాంటి వారు జనం మధ్య చాలా మంది ఉన్నారని, వారిని ప్రజలకు పరిచయం చేసే బాద్యతని జనసేన అధినాయకుడు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది, ప్రస్తుతానికి అతని విధానాలు నిశ్శబ్దంగా వున్న, భవిష్యత్తులో కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వినూత్నమైన అలజడిని సృష్టిస్తాయని, జనసేన ద్వారా పరిచయం అయ్యే నాయకులు కూడా రాష్ట్రంలో ఓ సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.