Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న జై లవకుశ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను హైద్రాబాద్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. అక్కడ సినిమాకు సంబందించిన మరిన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సెట్ కోసం ఏకంగా 2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. సినిమాలో ఈ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుందట !! ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపిస్తాడట, రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరా రేసులో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.