తెలంగాణ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేత అయిన పాల్వాయి రాజశ్యాసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా శుక్రవారం పాల్వాయికి తీవ్రమైన గుండె పోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో భాగంగా ఆయన కులు మనాలి వెళ్లారు.
పాల్వాయికి గుండె పోటు వచ్చిన సమయంలో కారులో ఉన్న సహచర ఎంపీలు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాల్వాయి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేట మండలం నందం పల్లి ఆయన స్వగ్రామం. 1936 నవంబర్ 19 న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే గా ఓ సారి ఎమ్మెల్సీ గా పనిచేసారు. కాగా ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.