Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న నటి త్రిష. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ నుంచి వేదింపులకు గురవుతుంది. గతంలో ఐటీ నిబంధల ప్రకారం ఆదాయపు రిటర్న్స్ దాఖలు చేయలేదని గతంలో ఐటీ శాఖ జరిమానా విధిందింది. అయితే దీనిపై త్రిష మద్రాస్ హై కోర్ట్ ని ఆశ్రయించింది. హై కోర్ట్ ఆమె జరిమానాని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే దీనిపై ఐటీ శాఖ మరల అప్పీలుకి వెళ్ళినట్లు తెలుస్తుంది. త్రిష మీద వేసిన జరిమాన ని రద్దు చేయడం కరెక్ట్ కాదని తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే దీనిపై త్రిష తన సన్నిహితుల దగ్గర ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఐటీ అధికారులు తనని ఎందుకు అలా వేదిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆమె వాపోయినట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా వున్నట్లు కూడా చెబుతున్నట్లు తెలుస్తుంది.