Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మెదక్ జిల్లాలో మాహాగర్జనను భారీ స్థాయిలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఎట్టకేలకు రాహుల్ మన్ననలను పొందారు. సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు కాస్త దైర్యం వచ్చింది. దీంతో ఇదే ఊపుతో పార్టీని మరికాస్త బలోపేతం చెయ్యాలని అనుకుంటున్నారట. ప్రతి జిల్లాలో పర్యటించి ఈ సారి తెరాసా కి గట్టి పోటీని ఇవ్వాలనీ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నారు. అవసరమైతే ఆ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను కూడా రప్పించి సభలను ఏర్పాటు చేసేందుకు వ్యూహలను రచిస్తున్నారు.

ఎందుకంటే ఇంతకుముందు ఎలక్షన్ లో పక్కాగా గెలుస్తుందనుకున్న స్థానాలలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లను కూడా రాబట్టలేకపోయింది. అందుకే తిరిగి పుంజుకోవడానికి ప్రచారాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారట. అవసరమైతే రాహుల్ ని , ప్రియాంకా గాంధీని కూడా పిలిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి . అయితే రాహుల్ మాత్రం తప్పక వస్తాడు అలాగే ప్రియాంక కూడా వస్తే ఏకా పార్టీకి ఓ కల వచ్చినట్టేనని అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.