Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత పవన్ నెక్స్ట్ సినిమాగా ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మించే చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడు. తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ,స్క్రిప్ట్ అన్ని సిద్ధం చేసింది .. అయితే ఈ సినిమా చేయడానికి పవన్ ఆసక్తి గా లేడని టాక్ ? అయన తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చాడట !! అయితే ఈ సినిమాను పవన్ చేయకపోవడానికి కారణం .. ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కానీ మరో వైపు అయన మైత్రి మూవీ మేకర్స్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు కాబట్టి ఈ సినిమానుండి తప్పుకున్నాడేమో అంటున్నారు సినీ జనాలు. ఏది ఏమైనా ఈ విషయం పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.!!