Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భార‌తీయ అమెరిక‌న్లు అమెరికా రాజ‌కీయాల్లో ఇప్పుడు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం హోరాహోరీగా సాగుతున్న ప్ర‌చారంలోనూ, పార్టీ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లోనూ భార‌తీయులు పాత్ర చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఇల్లినాయిస్ కు చెందిన భార‌త సంత‌తికి చెందిన రాజా కృష్ణ‌మూర్తిని ఎమ‌ర్జింగ్ లీడ‌ర్ గా నియ‌మించినట్టు డెమోక్ర‌టిక్ పార్టీ ప్ర‌క‌టించింది.

డెమోక్ర‌టిక్ పార్టీ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ లో తాజాగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కృష్ణ‌మూర్తికి డెమోక్ర‌టిక్ పార్టీ ఈ అత్యున్న‌త గుర్తింపును ఇచ్చింది. మార్చి 16 న జ‌రిగిన స్థానిక‌ ఎన్నిక‌ల్లో కృష్ణ‌మూర్తి ఇల్లినాయిస్ నుంచి డెమోక్ర‌టిక్ అభ్య‌ర్ధిగా భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో డెమోక్ర‌టిక్ పార్టీ ఆయ‌న‌కు త‌గిన గుర్తింపును ఇస్తూ ఈ గౌర‌వాన్ని అంద‌జేసింద‌ని తెలిసింది.