ఏపీలో తెలుగు దేశం పార్టీకి ఏకుమేకై కూచుంది సీపీఎం. తేదేపా యాక్టివిటీస్ని, రాజధాని కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్న సీపీఎం పార్టీ .. తెలంగాణలో మాత్రం వైఖరి మార్చుకుంది. ఇక్కడ తేదేపాతో అంటకాగేందుకు సై అంటోంది. ఆ మేరకు స్పష్టమైన సంకేతాలందాయి.
కేసీఆర్ విధానాలు, ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో తెలంగాణ సీపీఎం దోస్తీ కడుతోందన్నది తాజాగా హాట్ న్యూస్. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న పాదయాత్రకు రేవంత్ మద్దతునివ్వడం.. ఆ ఇద్దరి మధ్యా స్నేహం తెలంగాణలో విస్త్రతంగా చర్చకొచ్చింది. ఏపీలో తమని వ్యతిరేకిస్తున్న పార్టీతో దోస్తానా? ఏంటి అన్న చర్చ సాగుతోంది.
అయితే ఇది రైతులకు సంబంధించిన సమస్యలపై పోరాటం.. కాబట్టి నవంబర్ 1న తేదేపా నేతలు సైతం సీపీఎంతో కలిసి పోరాడుతారని రేవంత్ అన్నారుట ఇదంతా చూస్తుంటే .. రాజకీయాల్లో గేమ్ ప్లాన్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరూ అర్థం చేసుకోలేరని ప్రూవైనట్టే కదూ? తేదేపా .. సీపీఎంతో దోస్తీ కడితే భాజపాతో చెలిమి మాటేమిటో?