Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశం మొత్తం మీద, అవినీతి నిరోధక, ఇన్కమ్ టాక్స్, సిబిఐ సోదాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఈ సోదాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం చెన్నై లో రామలింగం క్లాత్ షో రూమ్ నిర్వహించిన అధికారులకు విస్తుపోయే దృశ్యం కనిపించింది. సుమారు 45 కోట్ల విలువైన పాత 500, 1000 రూపాయిల నోట్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, పలువుని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. అసలు ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సొమ్ము వెనుక ఎవరు నున్నారు, అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ దెబ్బకి ఒక్కక్కటిగా అవినీతి తిమింగలాలు, హవాలా మోసగాళ్ళు, షెల్ కంపెనీ కేటు గళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇంకా దేశంలో ముందు ముందు ఎన్ని సంచలనాలు చూడాలో, ఎన్ని వేల కోట్లు నల్లదనం, పాత నోట్లు, కుంభకోణాలుచూడాలో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైన దాడి మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ దాడులు కేవలం వ్యాపారుల మీద కాకుండా రాజకీయ నాయకుల మీద కూడా చేస్తే, ఇంకా విస్తుపోయే నిజాలు ఎన్నో వెలుగులోకి వచ్చే అవకాశం వుందని ప్రజలు చెప్పుకోవడం విశేషం.