Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

స్త్రీలలో నడుము నొప్పి సమస్య చాలా మందికి ఉంటుంది. నడుము పట్టేయడం, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడటం ఒక కారణమయితే, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు మరికొన్ని కారణాలు. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఆయుర్వేదంలో చికిత్స ఉంది.

పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కడుపులో గ్యాస్‌ను పెంచే సెనగలు, మసాలా పదార్థాల వంటి వాటిని దూరం పెట్టాలి. కూర్చునే, నిల్చునే భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు. ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.

శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.