Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావలసినవి: సామల బియ్యం- ఒక గ్లాసు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో- ఒకటి, క్యారట్- ఒకటి, బీన్స్- ఐదు, పచ్చి బఠాణి- గుప్పెడు, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- ఒక టీ స్పూన్, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- నాలుగు టీ స్పూన్లు, పసుపు- అర టీ స్పూన్

తయారీ:  సామల బియ్యాన్ని కడిగి రెండున్నర గ్లాసుల నీరు పోసి పది నిమిషాల సేపు నానబెట్టాలి. ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటోలను చిన్న ముక్కలుగా తరగాలి   ప్రెషర్ పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పది సెకన్లపాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి సన్నమంట మీద వేగనివ్వాలి. అవి మెత్తబడిన తర్వాత క్యారట్, బీన్స్, పచ్చిబఠాణి, పసుపు వేసి బాగా కలిసి మూత పెట్టి రెండు నిమిషాల సేపు ఉంచాలి

పైవన్నీ నూనెలో సన్నమంట మీద మగ్గిన తర్వాత సామబియ్యం నీటితోపాటు వేసి ఉప్పు కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. దీనిని నేరుగా బాణలిలో కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీటి మోతాదు కొద్దిగా పెంచాలి. దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ కిచిడీకి ఆవకాయవంటి పచ్చళ్లు, పుదీన, వేరుశనగపప్పు చట్నీలు బాగుంటాయి.