Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బీజేపీకి ప్రచారం చేసేందుకు సెలవివ్వలేదనే కారణంతో ప్రధాని నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఓ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగుళూరు తాలూకా సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబర్‌(41) ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. ఈనెల 5 నుంచి 12 వరకు సెలవుపెట్టి కర్ణాటక వచ్చారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు.

దక్షిణ కన్నడ నియోజకవర్గంలో ఈనెల 18న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అప్పటివరకు సెలవు పొడిగించాలని కోరగా అక్కడి అధికారులు నిరాకరించారు. దీంతో సుధీంద్ర ఏకంగా ఆ ఉద్యోగానికే రాజీనామా చేసేశాడు. దేశం బాగుపడాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నాడు. ఎన్నికల తరువాత సిడ్నీ తిరిగి వెళ్తానని చెప్పారు. తన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారని, వెళ్లాక ఏదైన మరో ఉద్యోగంలో చేరతానన్నాడు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన సిడ్నీ నుంచి వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నాడు. ఆయన భార్య ఫిజిలో నివసిస్తున్నారు.