Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారతదేశ ప్రముఖ బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని ఆ తరువాత వారికి మొండి చేయి చూపించిన ప్రముఖ వ్యాపార వేత్తకు చేదు అనుభవం ఎదురైంది. 9000 కోట్ల అప్పు తీర్చకుండా లండన్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న విజయ్ మాల్యా భారత్ , సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ చుడటానికి ఓవల్ మైదానానికి వచ్చాడు. అయితే కొందరు భారతీయులు విజయ్ మాల్యా ని చూసి గేలి చేశారు. చోర్‌ చోర్‌ విజయ్‌మాల్యా చోర్‌ ( దొంగా దొంగా విజయ్ మాల్యా దొంగా ) అంటూ.. నినాదాలు చేశారు. అంతే కాకుండా డబ్బులు తీసుకొని పారిపోయిన ఒక మోసగాడు. మా డబ్బు మాకిచ్చేయ్ అంటూ.. హిందీలో నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. విమర్శలు చేసేవారిని ఏమనలేక మాల్యా తల దించుకొని
వెళ్ళిపోయాడు. అంతే కాకుండా కొంతమంది సెల్ఫీలు కూడా దిగడం మారో విశేషం. అయితే మరికొందరు దొంగతో సెల్ఫీలు దిగడమేంటని కౌంటర్ లు కూడా వేశారు.