Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంలో కెప్టెన్ కోహ్లికి, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య వివాదం నడుస్తున్నలు గత కొంత కాలంగా వినిపిస్తుంది. దీనిని కాన్ఫర్మ్ చేసేవిధంగా కోచ్ కో బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆలాగే టీంలో కూడా సుమారు 10 మంది ఆటగాళ్ళు కుంబ్లే కోచ్ గా ఉంచడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. కుంబ్లేని కోచ్ గా తొలగించాలని కోహ్లి బీసీసీఐకి సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో తాజాగా బీసీసీఐ రానున్న వెస్ట్ ఇండీస్ సీరిస్ వరకు కుంబ్లేని కోచ్ గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కోచ్ తో విభేదాలు విజయం కోసం అందరు కలిసి పనిచేయాలని బీసీసీఐ కోహ్లికి చెప్పినట్లు తెలుస్తుంది. ఇది ఫైనల్ అని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని కూడా కోహ్లికి క్రికెట్ బోర్డు పెద్దలు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కెప్టెన్ కోహ్లికి గట్టిగా పంచ్ పడిందని అందరు అనుకుంటున్నారు.