ప్రధానంగా హేచ్ 1–బీ వీసాల జారీలో తీసురానున్న సవరణ కారణంగా విదేశీయులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణుల్లో ఎక్కువ శాతం అక్కడకు వెళ్లేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులు కలుపుకుని 2016లో 8,40,160 ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య, 2017లో 8,08,640కు (4 శాతం మేర) తగ్గినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ, స్టూడెంట్ అంyŠ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఈఎస్) సమాచారం బట్టి తెలుస్తోంది.
అమెరికాపై దుష్ప్రభావం చూపొచ్చు…
అమెరికా యూనివర్శిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్ డిగ్రీలు పూర్తి చేసే భారతీయులే అక్కడి కంపెనీలకు ప్రతిభ విషయంలో ప్రధాన వనరుగా ఉంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. అక్కడి ప్రభుత్వం విధానాల పరంగా మార్పుల «ప్రక్రియను కొనసాగించిన పక్షంలో విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, కంపెనీలు మొత్తంగా ఆర్థికరంగంపై వాటి దుష్ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది. విదేశీ విద్యార్థులు ఆయా రంగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక అక్కడ పనిచేసే సామర్థ్యాన్ని అడ్డుకునే విధంగా ఉన్న అమెరికా ప్రభుత్వ విధానాలు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయొచ్చనే ఆందోళన వ్యక్తంచేసింది.
అక్కడ విదేశీ విద్యార్థులదే సింహభాగం…
అమెరికా యూనివర్శిటీల్లో ముఖ్యంగా వివిధ కోర్సులు చదివే వారిలో విదేశీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 93 శాతం, కంప్యూటర్ సైన్స్లో 88 శాతంగా ఉన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో తగిన సంఖ్యలో ఇతర దేశాల విద్యార్థులు లేకుండా మాస్టర్స్తో పాటు గ్రాడ్యుయేట్ కోర్సుల నిర్వహణ కూడా కష్టమని గతేడాది అక్టోబర్లో విడుదల చేసిన మరో నివేదికలో ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. విదేశీ విద్యార్థులకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ఓపీటీ ( స్టెమ్ ఓపీటీ) పరిమితం చేయడమో లేదో తొలగించడమో చేయనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సూచించింది.
ఓపీటీ ద్వారా విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా చదువు కొనసాగించేందుకు, శిక్షణ పొందేందుకు, పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది. కెనడా, ఆస్ట్రేలియాలలో ఇతర దేశాల విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత పనిచేసేందుకు అనువైన విధానాలున్నాయని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. అయితే ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వ విధానాల వల్ల అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల నమోదుపై ప్రభావం పడవచ్చునని అభిప్రాయపడింది.