Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రోజు రోజుకి క్రికెట్ అభిమానుల అవధులు మితిమీరిపోతున్నాయి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోపి ఉన్నందున రోజు జారిగే మ్యాచ్ లకు క్రికెట్ అభిమానులు కాంట్రవర్సీలు చేస్తూ.. కొందరి అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నారు. మొన్నటి వరకు పాకిస్థాన్ అభిమానులు ఈ తరహా విధానాన్ని కొనసాగిస్తే ఇప్పుడు బాంగ్లాదేశ్ కూడా ఈ తరహాలోనే ఆలోచిస్తుంది. వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ లను ను ఆసరాగా చేసుకొని న్యూజిలాండ్ ని ఓడించి మొదటి సారిగా ఛాంపియన్స్ ట్రోపి సెమిస్ లో నిలిచింది.

అయితే రేపు ఇండియాతో బంగ్లా సెమి ఫైనల్ ఆడుతున్నందున కొందరు బంగ్లా అభిమానులు సోషల్ మీడియాలో ఇండియా జాతీయ పథకాన్ని అవమానించే విధంగా పోస్టు చేస్తున్నారు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఈ విషయంపై భగ్గుమంటున్నారు. ఎందుకంటే ఆ ఫొటోలో ఓ కుక్కపై భారత జాతీయ పథకాన్ని కప్పి ఉంచారు. దాని వెనకునే బంగ్లా జాతీయ పతాకం కప్పబడి ఉన్న టైగర్ వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వివాదంగా మారింది. అయితే కొందరు ఇండియా అభిమానులు కూడా అదే స్థాయిలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. రేపు పులి ఎవడో, పిల్లి ఎవడో తెలుస్తుందని అంటున్నారు.