భారత ఎకనామిని ఉద్ధరించడానికి భారత ప్రధానులు చేస్తున్న ప్రయత్నాలు వారికి ఎదురవుతున్న అవరోధాలపై ఓ కార్టూన్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.గత ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని మోడీ లు ఎకనామిని బాగు చేయడానికి చేసిన ప్రయత్నాలను ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. తోలి రెండు దశల్లో మన్మోహన్ ఎసిబి, డి ఈ ఎఫ్ ఆపరేషన్ లను పేషంట్ గా ఉన్న భారత ఎకానమీ పై చేపడతారు. మూడో దశలో మన్మోహన్ చేతిలో కత్తికనపడగానే పేషేంట్ నిరసించిపోతాడు అంటే ఆర్ధిక మాంద్య ప్రభావం అన్న మాట.
అనంతరం కొత్త డాక్టర్ మోడీ వస్తాడు. మోడీ చేతిలో రంపం చూడగానే పేషేంట్ బిత్తరపోతాడు. 2016 లో మోడీ అసలైన ఆపరేషన్ మొదలు పెడతారు. మోడీ బ్ పేషేంట్ పై శస్త్ర చికిత్సకు శ్రీకారం చుట్టడంతో పేషేంట్ దాదాపు చనిపోయింత గా భావిచాల్సి ఉంటుంది. ఇక ఎకానమీ పూర్తిగా దిగజారక 2018 లో తిరిగి ఎకనామిని వృద్ధి లోకి తీసుకునిరావడానికి మోడీ ఆపరేషన్ ని మొదటి నుంచి ప్రారంభిస్తాడని భావించాలి. భారత ఆర్ధిక వయ్వస్థ ని బాగుచేయడానికి ఏ రకంగా ప్రయత్నించినా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ కార్టూన్ చెప్పకనే చెబుతోంది.