Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టాలీవుడ్ లో వారసత్వ హీరోలకు కొదవ లేదు. ఇప్పటివరకు చలన చిత్రాన్ని ఏలుతున్న వారిలో సగం మందికి పైగా వారే ఉన్నారు. అయితే హీరోగా ఎదగడానికి వారికంటూ ఓ ప్రత్యేకత ఉండాలని నేటి తరం యువ హీరోలకు బాగా తెలుసు. అందుకే అభిమానులను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో కింగ్ నాగార్జున తనయులు కూడా మారారు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్యూర్ ని చుసిన ఈ యువహీరోలు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చైతు సెట్ అయ్యాడు.

ఇక అఖిల్ విషయానికి వస్తే తన రెండవ సినిమాతో అయినా రీ లంచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇందుకోసం నాగ్ ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా అఖిల్ రెండవ మూవీలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వచ్చిన వదంతులను నాగ్ కొట్టిపారేశారు. ఆమెను నాగ్ ప్రత్యేకంగా ఒప్పించి భారీ రెమ్యునరేషన్ ను అఫర్ చేసినట్లు వస్తున్న కథనాలు అవాస్తవమని నాగ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మనం సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.